బీజింగ్ : కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాకూ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ చేరింది. ఉత్తర చైనాలోని టియాంజిన్ నగరంలో కొత్త వేరియంట్ కేసు నమోదైంది. దీన్ని ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఉత్పరివర్తనం బారినపడ్డ వ్యక్తి డిసెంబర్ 9న విదేశాల నుంచి నగరానికి వచ్చాడని టియాంజిన్ డైలీ తెలిపింది. సదరు వ్యక్తి ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచగా.. చికిత్స పొందుతున్నాడని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇవాళ యూకే ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఓ వ్యక్తి మరణించగా.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ధ్రువీకరించారు.