కాంబోడియా విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ
నమ్పెన్: ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మీదనున్న అంతస్తుల్లోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లడం కష్టతరమవుతుంది. కాంబోడియాకు చెందిన విద్యార్థులు దీనికి చక్కని పరిష్కారాన్ని చూపించారు. పాఠశాల కుర్చీతో మానవసహిత డ్రోన్ వ్యవస్థను రూపొందించారు. దీనిసాయంతో అగ్నిప్రమాదం జరిగిన భవంతుల్లోని పై ఫ్లోర్లలో ఎంతమంది చిక్కుకున్నారు? అన్న విషయాన్ని తెలుసుకోవడంతోపాటు.. మంటలను ఆర్పేందుకు కార్బన్ డై ఆక్సైడ్ సిలిండర్ను పైవరకు తీసుకెళ్లడం, వాయువును పిచికారీ చేయడం, నీటిని జల్లడం వంటివి చేయవచ్చని నేషనల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంబోడియా విద్యార్థులు తెలిపారు. ట్రాఫిక్లో చిక్కుకున్న రోగులను తరలించడానికి ప్రాథమికంగా ఈ డ్రోన్ను తయారుచేసినట్టు చెప్పారు. మరిన్ని ఫీచర్లు జోడించి డ్రోన్ ఎగిరే ఎత్తును పెంచుతామన్నారు.
మోయగలిగే బరువు 60 కిలోలు
ఎగిరే ఎత్తు 13.1 అడుగులు
ప్రయాణించే దూరం 1 కిలోమీటరు
ఖర్చు 14.75 లక్షలు