స్కోప్జె: ఉత్తర మాసిడోనియాలోని కొకని పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ నైట్క్లబ్లో స్థానిక పాప్ బృందం కచేరీ నిర్వహిస్తుండగా బాణసంచా కారణంగా భవనంపై కప్పుకు మంటలు వ్యాపించాయి. దీంతో కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. అగ్ని ప్రమాదం వల్ల భవనం పైకప్పు పాక్షికంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 59 మంది దుర్మరణం చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. వారిని వివిధ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన భవనం గతంలో కార్పెట్ గోదాముగా ఉండేదని స్థానిక మీడియా పేర్కొంది. నైట్క్లబ్కు లైసెన్స్ ఉందా? భద్రతా ప్రమాణాలను పాటించారా? అన్న విషయాలపై దర్యాప్తు చేస్తామని హోం శాఖ మంత్రి తొష్కోవ్స్కీ తెలిపారు.