ఖాట్మండు: నేపాల్ ఇవాళ వరుస భూకంపాలతో దద్ధరిల్లుతున్నది. మధ్యాహ్నం కేవలం గంట వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించగా, సాయంత్రం 5 గంటలకు మరో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. ఉత్తరాఖండ్కు 94 కిలోమీటర్ల తూర్పున పితోర్గఢ్లో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
కాగా, ఇవాళ మధ్యాహ్నం కూడా కేవలం గంట వ్యవధిలోనే నాలుగు భూకంపాలు సంభవించాయి. 2.25 గంటలకు 4.6 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది.
ఆ తర్వాత 2.51 గంటలకు 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రతకు నేపాల్తోపాటు ఉత్తర భారతదేశం కూడా కంపించింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్తోపాటు ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
అనంతరం 3.06 గంటలకు 3.6 తీవ్రతతో మరో భూకంపం చోటుచేసుకుంది. ఈ భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఆ వెంటనే 3.19 గంటలకు 3.1 తీవ్రతతో నాలుగో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం 10 కిలో మీటర్ల లోతులో నమోదైంది. ఇలా మొత్తం నాలుగుసార్లు భూమి కంపించింది.