మాడ్గుల, ఏప్రిల్ 19 : కరోనా మహమ్మారి దరిచేరకుండా కూలీలందరూ మాస్కు ధరించి ఉపాధి పనులకు రావాలని ఎంపీడీవో ఫారుఖ్హుస్సేన్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. కొలతల ప్రకారం పనులు చేస్తే రూ.245 చెల్లించాలన్నారు. వేసవి నేపథ్యంలో కూలీలందరూ ఉదయం 8 గంటల వరకే పనులకు రావాలని, మాస్కు ధరించి, భౌతికదూరం పాటించడంతో కరోనాను అరికట్టవచ్చన్నారు. 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అనంతరం ఉపాధిహామీ పనులపై మస్టర్లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. అర్హులకు ఉపాధి జాబ్కార్డు అందజేసి పనులు కల్పించాలన్నారు.
ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి
ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ యాదయ్య, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ పొలాల్లో జంగిల్ కటింగ్, భూమి చదును, వాలు కట్ట నిర్మాణాలు, ఫాం పాండ్ నిర్మాణం, మట్టి రోడ్ల నిర్మాణ పనులను చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వీరయ్య, నాయకులు లాయక్అలీ, జంగయ్యయాదవ్, వెంకట్యాదవ్, సురేశ్ పాల్గొన్నారు.
జాగ్రత్తలు పాటించాలి
ఉపాధి హామీ పనులు చేపట్టే ప్రాంతాల్లో కూలీలు కరోనా జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీవో మహేశ్బాబు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..కొవిడ్ నేపథ్యంలో పని ప్రదేశాల్లో కూలీలు మాస్కు ధరించి పనులు చేపట్టాలన్నారు. పనుల్లో భౌతిక దూరం పాటించాలని తెలిపారు. 45ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకునే విధంగా ఉపాధి సిబ్బంది, కార్యదర్శులు అవగాహన కల్పించాలన్నారు.
ఇవీ కూడా చదవండి…
ప్రతి తండాకు బీటీ రోడ్డు, పంచాయతీ భవనం నిర్మిస్తాం