Bomb Blast | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో సోమవారం బ్లాస్ట్ జరిగింది. రష్యా రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు చోటుచేసుకున్నది. బ్లాస్ట్లో దాదాపు 20మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు రష్యా దౌత్యవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇంతకు ముందు ఆగస్టు 2న హెరాత్లోని మసీదులో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత హెరాత్ ప్రావిన్స్లో గుజార్గా మసీదులోనూ శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా మతపెద్ద ముజీబ్ ఉల్ రెహ్మాన్ అన్సారీ, అతని భద్రతా సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారని హెరాత్ పోలీసు అధికారులు తెలిపారు. తాలిబన్లు కాబూల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో చాలాచోట్ల బాంబుదాడులు కొనసాగుతున్నాయి.