ఇస్లామాబాద్ : గతంలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన లష్కరే తోయిబా మాజీ కమాండర్ (Lashkar commander shot dead) అక్రం ఖాన్ను పాకిస్తాన్లో కాల్చిచంపారు. అక్రం ఘజిగా పేరొందిన అక్రం ఖాన్ను బజౌర్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. 2018 నుంచి 2020 వరకూ లష్కరే రిక్రూట్మెంట్ విభాగానికి నేతృత్వం వహించిన అక్రం ఖాన్ పాకిస్తాన్లో భారత్ వ్యతిరేక ప్రసంగాలతో పేరొందాడు.
ఉగ్ర సంస్ధ నాయకత్వంలో అగ్రభాగాన ఉన్న అక్రం ఖాన్ దీర్ఘకాలంగా ఉగ్ర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. కాగా, ఈ ఏడాది అక్టోబర్లో పఠాన్కోట్ దాడి వెనుక సూత్రధారి షాహిత్ లతీఫ్ను సైతం పాకిస్తాన్లో కాల్చిచంపారు.
పాకిస్తాన్ గుజ్రన్వాలా నగరానికి చెందిన లతీఫ్ పాక్ నుంచి భారత్ కోరుతున్న టెర్రరిస్టుల్లో ఒకరిగా ఉన్నాడు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో రావల్కోట్లోని మసీదులో లష్కరే టాప్ కమాండర్ను సైతం సాయుధ దుండగులు మట్టుబెట్టారు. ఉగ్రవాదిని రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసింగా గుర్తించారు.
Read More :