ఈ ఫోటో చూశారా. ఇది ఎవరెస్ట్ బేస్ క్యాంప్. ఇప్పుడీ క్యాంప్ను మార్చనున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల బేస్ క్యాంప్ అసురక్షితంగా మారినట్లు నిపుణులు చెబుతున్నారు. పర్వతారోహకులు తమ సీజన్ను ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. సుమారు 1500 మందికి ఇక్కడ వసతి ఏర్పాట్లు ఉంటాయి. అయితు కుంబ్ గ్లేసియర్ వేగంగా కరిగిపోతున్న కారణంగా అక్కడ ఉన్న బేస్ క్యాంపును మరో చోటుకు తరలించేందుకు నేపాల్ టూరిజం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత బేస్ క్యాంప్ సుమారు 5,364m ఎత్తులో ఉంది. కొత్త క్యాంపును 200m నుంచి 400m తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయనున్నట్లు నేపాల్ టూరిజం శాఖ తెలిపింది.