లండన్: యూరోప్ దేశాలు ఓ విషాదకర మైలురాయిని దాటాయి. ఆ దేశాల్లో కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య పది లక్షలు దాటింది. వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నా.. యూరోప్ దేశాల్లో మాత్రం వైరస్ ఉదృతి కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. యూరోప్ యూనియన్లో ఉన్న 52 దేశాల్లో.. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1,000,288 మంది మరణించారు. మహమ్మారి విషయంలో కీలక దశలో ఉన్నామని డబ్ల్యూహెచ్వో టెక్నికల్ లీడ్ మారియా వాన్ ఖేర్ఖోవ్ తెలిపారు. మహమ్మారి మొదలై 16 నెలలు అవుతోందని, కానీ ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఇప్పటికే 29 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 13.6 కోట్ల మందికి వైరస్ సంక్రమించింది.