న్యూఢిల్లీ : 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడులను ఇజ్రాయెల్పై పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ అక్టోబర్ 9న చేపట్టిన దాడులతో దౌత్యవేత్త నోర్ గిలన్ పోల్చారు. రెండు దాడుల్లో జన జీవనాన్ని ధ్వంసం చేసి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాలని ఉగ్రవాదులు కోరుకున్నారని భారత్లో ఇజ్రాయెల్ రాయబారి గిలన్ అన్నారు.
ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్కు భారత్ వెన్నంటి నిలిచిందని చెప్పారు. ఉగ్రమూకలు ముంబైలో ప్రజల ఇండ్లలోకి వచ్చి విధ్వంసం సృష్టించి భయాన్ని రేకెత్తించారు. అదే రీతిలో ఇజ్రాయెల్పై హమాస్ వ్యవహరించింది. ఉగ్రవాదులు ప్రజలను చంపడమే కాదు బతికున్నవారిలో భయాన్ని కలిగించాలని వారు కోరుకుంటారని పేర్కొన్నారు.
ప్రపంచానికి సవాల్ విసిరిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో చేతులు కలపాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ దేశాలు, ప్రజలు సమిష్టిగా ఉగ్రవాదంపై పోరాడాలని అన్నారు. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ)ని ఇజ్రాయెల్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత రాయబారి ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడులకు లష్కరే తోయిబా తెగబడిన క్రమంలో గిలన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More :
Randeep Hooda | 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటుడు.. వధువు ఎవరంటే.?