ఇస్లామాబాద్, ఆగస్టు 26: పాకిస్థాన్ను వరదలు కుదిపేస్తున్నాయి. సింధ్ ప్రావిన్స్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకూ 937 మంది మరణించారు.
మృతుల్లో 343 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాక్ ప్రభుత్వం గురువారం నేషనల్ ఎమర్జెన్సీ విధించింది.