వాషింగ్టన్: అమెరికా-కెనడా సరిహద్దు ప్రాంతంలోని నదిలో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో భారతీయులు, కెనడా దేశస్థులు ఉన్నారు. కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పడవ మునిగి మృతిచెంది ఉంటారని పోలీసులు తెలిపారు.
మృతుల్లో ఆరుగురు పెద్దవారు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. చిన్నారులు కెనడాకు చెందిన వారని పాస్పోర్టుల ద్వారా తెలిసిందని, వీరిని భారత్, రొమేనియా కుటుంబాలుగా గుర్తించినట్టు బీబీసీ తెలిపింది.