పారిస్: ఫ్రాన్స్లో ఉన్న ఈఫిల్ టవర్ను మళ్లీ తెరవనున్నారు. శుక్రవారం నుంచి సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. తొమ్మిది నెలల విరామం తర్వాత ఈఫిల్ టవర్ను తెరుస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఐరన్ లెడీ ఈఫిల్ టవర్ను మూసివేశారు. ప్రతి రోజు కేవలం 13 వేల మందికి మాత్రమే టవర్ను వీక్షించే అవకాశం కల్పించనున్నారు. సోషల్ డిస్టాన్స్ పాటించే లక్ష్యంతో టూరిస్టుల సంఖ్యను తగ్గించారు. అయితే వచ్చే బుధవారం నుంచి విజిటర్స్.. వ్యాక్సినేషన్ లేదా నెగటివ్ సర్టిఫికేట్ను చూపించాల్సి ఉంటుంది. ఇటలీ, ఫ్రెంచ్, స్పానిష్ విజిటర్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈఫిల్ టవర్ను 1889లో నిర్మించారు. దీన్ని ఆర్కిటెక్ట్ గుస్తావ్ ఈఫిల్. ఇప్పటిక వరకు దానికి 20 సార్లు రంగు వేశారు.