కైరో: రఫా పట్టణంపై దాడులకు ఇజ్రాయెల్ దళాలు సన్నాహాలు చేస్తుండటంతో ఈజిప్ట్ అప్రమత్తమైంది. దక్షిణ గాజా సరిహద్దుల్లో భారీ గోడను నిర్మిస్తున్నది. శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. గాజాలోని సగం జనాభా ప్రస్తుతం రఫాలోనే తలదాచుకుంటున్నది.
గోడ నిర్మాణం గురించి బహిరంగంగా ప్రకటించని ఈజిప్ట్.. పాలస్తీనియన్లను బలవంతంగా తమ భూభాగంలోకి నెట్టొద్దని ఇజ్రాయెల్ను కోరింది. హమాస్ ఉగ్రవాదులు అక్టోబరు 7న ఇజ్రాయెల్పై దాడులు చేయడంతో ఇరు వర్గాల మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.