క్విటో: ఈక్వెడార్లోని జైలులో రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య వంద దాటింది. ఈక్వెడార్లోని గుయాక్విల్ జైలులో మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇప్పటివరకు 116 మంది ఖైదీలు మరణించారని అధికారులు మరణించారని అధికారులు తెలిపారు. జైలులో జరిగిన ఈ ఘర్షణ దేశ చరిత్రలో అత్యంత హీనమైనదిగా మిగిలిపోతుందని చెప్పారు.
గుయాక్విల్ జైలో శిక్ష అనుభవిస్తున్న రెండు డ్రగ్ గ్యాంగుల మధ్య మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వివాదం చెలరేగింది. అదికాస్తా ఘర్షణకు దారితీసింది. సాయంత్రానికి జైలు బాంబులు, తుపాకుల మోతలతో దద్దరిల్లింది. ఈ ఘర్షణను అదుపుచేయడానికి 400 మంది పోలీసులు, మిలటరీ 5 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.
కాగా, ఈక్వెడార్లోని మూడు జైళ్లలో గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో 79 మంది మరణించారు. జూలైలో జరిగిన మరో ఘటనలో 22 మంది ఖైదీలు మృతిచెందారు.