జకార్తా : ఇండోనేషనల్లో మంగళవారం సంభంకం సంభవించింది. ఉదయం 6.73 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో బలమైన ప్రకంపనలు రికార్డయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. సులవేసి కొటమోబాగుకు 779 కిలోమీటర్ల దూరంలో, భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు నష్టంకు సంబంధించిన వివరాలు అందలేదని అధికారులు తెలిపారు.
ఇటీవల ఇండోనేషియాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఏప్రిల్లోనే దాదాపు నాలుగుసార్లు రిక్టర్ స్కేల్పై 5 తీవ్రతతో భూకంపాలు వణికించాయి. మరోసారి ఇవాళ ఉదయం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఇండోనేషియా వాతావరణ శాఖ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తీర ప్రాంతాల్లో నివసించే జనం ఇండ్లను ఖాళీ చేయాలని సూచించింది.