కౌలాలంపూర్: సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మలేషియాలో సోమవారం తెల్లవారుజామున 2.39 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 6.8గా నమోదయింది. కౌలాలంపూర్కు 504 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
అదేవిధంగా ఫిలిప్పీన్స్లో కూడా భూమి కంపించింది. బటాన్ ప్రావిన్స్లోని లుజాన్ దీవిలో ఉదయం 5.05 గంటల సమయంలో భూ ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. దీనితీవ్రత 6.4గా నమోదయిందని, మనీలాకు 157 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది.
భూకంప తీవ్రతకు మనీలాలోని ఇండ్లు వణికిపోయాయని, ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులుపెట్టారని అధికారులు తెలిపారు. కాగా, భూకంపాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించారు. కాగా, వరుస భూకంపాల వల్ల ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవన్నారు.