న్యూయార్క్: బెన్నూ గ్రహశకలానికి(Asteroid Bennu) చెందిన శ్యాంపిళ్లు భూమికి చేరాయి. నాసాకు చెందిన ఓసిరిస్-రెక్స్ స్పేస్క్రాఫ్ట్ ద్వారా ఆ శ్యాంపిళ్లను పట్టుకువచ్చారు. ఆ స్పేస్క్రాఫ్ట్కు చెందిన క్యాప్సూల్.. అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలో దిగింది. బెన్నూ గ్రహశకలం నుంచి రాళ్లు, దుమ్ముకు చెందిన శ్యాంపిళ్లను పట్టుకువచ్చారు. సౌరవ్యవస్థపై అధ్యయనం కోసం ఆ గ్రహశకలాన్ని స్టడీ చేయనున్నారు. ఓఎస్ఐఆర్ఐఎస్-ఆర్ఈఎక్స్ స్పేస్క్రాఫ్ట్ను ఏడేళ్ల క్రితం లాంచ్ చేశారు. ఆ స్పేస్క్రాఫ్ట్ భూమి నుంచి బెన్నూ ఆస్టరాయిడ్ వద్దకు వెళ్లి దాని నుంచి శ్యాంపిళ్లను తీసుకువచ్చింది.
ఓఎస్ఐఆర్ఐఎస్-ఆర్ఈఎక్స్ అనగా.. ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూర్టీ, రిలోగిత్ ఎక్స్ప్లోరర్. ఇది 2016లో నింగిలోకి ఎగిరింది. 2018లో బెన్నూ కక్ష్యలోకి చేరుకుంది. ఇక 2020లో ఆ గ్రహశకలం నుంచి శ్యాంపిళ్లను సేకరించింది. 2021 మేలో మళ్లీ ఆ స్పేస్క్రాఫ్ట్ భూమికి తిరుగు ప్రయాణం అయ్యింది. అయితే ఈ మిషన్ కోసం ఆ స్పేస్క్రాఫ్ట్ సుమారు 3.86 బిలియన్ల మైళ్లు ప్రయాణించింది. బెన్నూ వరకు వెళ్లి అక్కడ నుంచి తిరిగి వచ్చేందుకు ఈ దూరం ప్రయాణించాల్సి వచ్చింది.
Today’s #OSIRISREx asteroid sample landing isn’t just the end of a 7-year, 3.9-billion-mile journey through space. It takes us 4.5 billion years back in time.
These rocks will help us understand the origin of organics and water that may have seeded life on Earth.… pic.twitter.com/sHLRrnWqAg
— NASA (@NASA) September 24, 2023
సుమారు 8.8 ఔన్సుల బరువు ఉన్న గ్రహశకల రాళ్లు, ధూళిని క్యాప్సూల్ తీసుకువచ్చింది. భూమికి సుమారు 63 వేల మైళ్ల(లక్ష కిలోమీటర్లు) దూరంలో బెన్నూ గ్రహశకలం సంచరిస్తోంది. గంటకు 27 వేల మైళ్ల(44వేల కిలోమీటర్లు) వేగంతో ఆ క్యాప్సూల్ భూ కక్ష్యలోకి చేరుకున్నది. పారాచూట్ల సాయంతో క్యాప్సూల్ను దించారు. ఉటాహ్ డిఫెన్స్ శాఖ టెస్టింగ్ సెంటర్ సమీపంలో ఆ క్యాప్సూల్ ల్యాండ్ అయ్యింది. భూమిపై క్యాప్సూల్ దిగిన వెంటనే నాలుగు హెలికాప్టర్లుతో దాన్ని ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. క్లీనింగ్ రూమ్కు చేరుకున్న తర్వాత ఆ క్యాప్సూల్ను నైట్రోజన్ వాయువుతో శుద్ధి చేశారు.
బెన్నూ శ్యాంపిళ్లను స్టడీ చేయడం వల్ల గ్రహాల ఏర్పాటు గురించి అవగాహన ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భూమిపై నీరు ఏర్పడడానికి గల కారణాలను కూడా అన్వేషించనున్నారు. ఆస్టరాయిడ్ల వల్ల కలిగే ప్రమాదాల గురించి కూడా లోతుగా అధ్యయం చేయనున్నారు.