Emergency Landing | దుబాయ్ వెళ్తున్న ఓ విమానం మహారాష్ట్రలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యల కారణంగానే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేసినట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ (Biman Bangldesh Airlines)కు చెందిన విమానం 396 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఢాకా (Dhaka) నుంచి దుబాయ్కి బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్య (technical glitch) తలెత్తింది. దీంతో విమానాన్ని మహారాష్ట్ర నాగ్పూర్ (Nagpur)కు దారి మళ్లించారు. నాగ్పూర్ విమానాశ్రయంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు అంతా సేఫ్గానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Nagpur, Maharashtra | Biman Bangladesh Airlines flight from Dhaka to Dubai made an emergency landing at Nagpur Airport today at around 12 am. The emergency landing was done due to a technical issue: Abid Ruhi, Senior Airport Director, Nagpur Airport.
(Photo source – NMC Fire… pic.twitter.com/kFsoyjr5w9
— ANI (@ANI) February 20, 2025
Also Read..
Rekha Gupta | శీష్ మహల్ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Odela 2 | ఇండస్ట్రీలో ఫస్ట్ టైం.. తమన్నా ఓదెల 2 అరుదైన ఫీట్..!