న్యూఢిల్లీ/ఒట్టావా: నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist) బెదిరించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ విడుదల చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.
కాగా, నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూసివేస్తారని పన్నూన్ తెలిపాడు. భవిష్యత్తులో ఆ విమానాశ్రయం పేరు కూడా మారుతుందని అన్నాడు. అలాగే నవంబర్ 19న జరుగనున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను ప్రస్తావిస్తూ ‘ఈ నవంబర్ 19, ప్రపంచ టెర్రర్ కప్ ఫైనల్తో సమానంగా ఉంటుంది’ అని ఆ వీడియోలో బెదిరించాడు.
New York and Canada based terrorist asks Sikhs to not fly Air India after Nov 19, as their lives can be under threat. He says they will not let Air India fly
They want to do what their hero Talwinder Parmar did #cdnpoli pic.twitter.com/45tSDUE0dE
— Journalist V (@OnTheNewsBeat) November 4, 2023