సిడ్నీ : శరీరంలోని మాంసాన్ని తినేస్తూ, ప్రాణాలు తీసే వ్యాధి నుంచి ఆస్ట్రేలియన్ మహిళ (48) కోలుకున్నారు. కాలేయం తదితర అవయవాలు పనిచేయకపోవడంతో ఆమెను సిడ్నీలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హాస్పిటల్కు తరలించారు. ఆమెకు క్లోస్ట్రిడియమ్ చౌవోయీ అనే బ్యాక్టీరియా సోకినట్లు వైద్యులు గుర్తించారు.
జంతువుల్లో వచ్చే బ్లాక్ లెగ్ వ్యాధికి కారణం ఇదేనని గమనించారు. దీనికి ఏ విధంగా వైద్యం చేయాలో నిర్దిష్టంగా ఏమీ తెలియదు. శరీరంలోని మాంసాన్ని తినేసే బ్యాక్టీరియాగా దీనిని పిలవవచ్చు. ఈ బ్యాక్టీరియా రక్తంలోకి చేరి, దానిని విషపూరితం చేస్తుంది. గతంలో ఇటువంటి వ్యాధి సోకిన జపాన్, అమెరికాలకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.