జెనీవా, సెప్టెంబర్ 1: ఐదు దశాబ్దాల కిందటితో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు నాలుగైదు రెట్లు పెరిగాయని, ఆస్తి నష్టం ఏడు రెట్లు పెరిగిందని ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక వెల్లడించింది. అయితే, మరణాల సంఖ్య మాత్రం తగ్గినట్టు తెలిపింది. ప్రకృతి విపత్తుల కారణంగా 1970-80ల్లో రోజుకు 170 మంది చనిపోతే 2010లో ఈ సంఖ్య 40కి పడిపోయిందని వెల్లడించింది. ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం. గడిచిన 50 ఏండ్లలో 11వేల ప్రకృతి విపత్తులు సంభవించాయి. 1970ల్లో ఏడాదికి సగటున 711 ప్రకృతి విపత్తులు సంభవించగా, 2000-2009 మధ్య కాలంలో ఏడాదికి 3,536 విపత్తులు వచ్చాయి. అయితే 2010 తర్వాత ఈ సంఖ్య కాస్త తగ్గి 3,165కు పడిపోయింది.