న్యూయార్క్: ట్విట్టర్లో భారీగా ఉద్యోగులను తొలగించాలనే తన నిర్ణయాన్ని ఎలాన్ మస్క్ సమర్థించుకున్నారు. తొలగింపు తప్పనిసరి అని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘ప్రతి రోజూ దాదాపు రూ.32 కోట్ల నష్టం వస్తున్నది. ఈ నష్టాన్ని ఎన్ని రోజులని భరిస్తాం. కాబట్టి ఉద్యోగుల ప్రక్షాళన తప్పనిసరి. వారిని భారీ స్థాయిలో తొలగించడం అనివార్యం’ అని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ ఉద్యోగుల్లో చాలా మందిని తొలగిస్తున్న విషయం తెలిసిందే. భారత్లో 200 మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. మరోవైపు అసత్య వార్తలను, విషయాలను ప్రచారం చేసే ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడం విచారకరమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు.