టెహరాన్ : (Cyber attack) ఇరాన్లోని గ్యాస్ స్టేషన్పై సైబర్ దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. దాంతో దేశవ్యాప్తంగా ఇంధన విక్రయ కేంద్రాలు స్తంభించాయి. ఇంధన సబ్సిడీ వ్యవస్థను నియంత్రించే సాఫ్ట్వేర్లో లోపం కారణంగా విక్రయాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని సమాచారం. అక్కడి సెమీ-అధికారిక వార్తా సంస్థ దీనిని సైబర్ దాడిగా పేర్కొన్నది. ఫలితంగా టెహరాన్లోని గ్యాస్ ఏజెన్సీల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఈ ఫొటోలను దేశంలోని పలు టీవీ ఛానళ్లు ప్రదర్శించడంతో ఇంకా అలజడి తీవ్రతరమైంది. అక్కడ పంపులు, స్టేషన్లు మూసివేశారు. అయితే, సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు అధికారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా సమాచారం.
ఈ ఘటనను సైబర్ దాడిగా అభివర్ణిస్తూ ప్రభుత్వం జారీ చేసిన కార్డుల ద్వారా ఇంధనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి ‘సైబర్ అటాక్ 64411’ అనే సందేశం వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అక్కడి సెమీ-అధికారిక వార్తా సంస్థ ఐఎస్ఎన్ఏ తెలిపింది. చాలా మంది తమ వాహనాల్లో ఇంధనం నింపుకోవడానికి సబ్సిడీలపైనే ఆధారపడుతున్నారు. అయితే, ఈ నంబర్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేని కార్యాలయ హాట్లైన్కి లింక్ చేయబడింది. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.
అయితే, ‘64411’ సంఖ్య జూలైలో ఇరాన్ రైలుమార్గ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్న దాడితో ముడిపడి ఉండటం విశేషం. ఆ సమయంలో కూడా ఇదే సంఖ్య కనిపించింది. ఇరాన్ నిరంతరం సైబర్ దాడులను ఎదుర్కొంటున్నది. ఆగస్ట్ నెలలో ఎవిన్ జైలును దుర్వినియోగం చేసిన వీడియో కూడా ఉన్నది. స్టక్స్నెట్ కంప్యూటర్ వైరస్ తర్వాత దేశం చాలా వరకు ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ఇంటర్నెట్ నుంచి తొలగించారు.
టీ20 టైటిల్ దక్కించుకోవడంలో భారత్ ఇప్పటికీ పోటీదారే : బ్రెట్లీ
పాకిస్తాన్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ : 11 మంది మృతి
ఇది లైవ్ బ్యాక్టీరియా క్లియర్ ఫొటో.. వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు
బందీపొరాలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాద దాడి
జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు ప్రారంభం
సూడాన్లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..