సియోల్: ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారని మండిపడింది. ఉక్రెయిన్కు అత్యాధునిక యుద్ధట్యాంకులు అందించడం ద్వారా రెడ్ లైన్ను మరింత దాటుతున్నదని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఫైరయ్యారు. అమెరికాకు వ్యతిరేకంగా తాముకూడా రష్యాకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికార మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది.
ఉక్రెయిన్కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు పంపుతామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. సుమారు 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులను పంపాలని అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. అమెరికాతోపాటు జర్మనీ కూడా యుద్ధ ట్యాంకులను అందించడానికి ముందుకు వచ్చింది. ఒకవేళ రెండు అగ్రదేశాలు యుద్ధ ట్యాంక్లను పంపిస్తే.. అప్పుడు ఉక్రెయిన్ వార్ కొత్త రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.