బీజింగ్, సెప్టెంబర్ 25: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను గృహనిర్బంధం చేశారన్న వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న జాతీయ కాంగ్రెస్ సమావేశాల కోసం 2,296 మంది ప్రతినిధులను ఎన్నుకొన్నది. ‘జిన్పింగ్ మార్గదర్శనంలో సోషలిజం ఆలోచనలతో చైనా కమ్యూనిస్టు పార్టీ గొప్ప విలువలు, భావజాలం ఉన్న ప్రతినిధులను ఎన్నుకొన్నది’ అని వెల్లడించింది. కాగా, చైనాలో సైనిక తిరుగుబాటు సంకేతాలేవీ కనిపించటం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.
పాలనా పగ్గాలు జిన్పింగ్ చేతుల్లోనే ఉన్నాయని, ఆ దేశ ఆర్మీ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నట్టు తెలుస్తున్నదని పేర్కొంటున్నారు. అయితే, జిన్పింగ్ గృహనిర్బంధంపై ఇప్పటికీ చైనా స్పందించలేదు.