వాషింగ్టన్: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగు రోజులుగా మూడు లక్షలకు తగ్గకుండా రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్లో పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడి అత్యున్నత స్థాయి వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌసీ స్పందించారు.
ప్రస్తుతం భారత దేశం అత్యంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదని డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్ చాలా ఘోరమైన స్థితిని ఎదుర్కొంటున్నదని చెప్పారు. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు భారత్లో నమోదవుతున్నాయన్నారు. భారత్లోని కరోనా వైరస్ రూపాల లక్షణాలు ఇంకా స్పష్టంగా తెలియడం లేదన్నారు.
అంతేగాక, కరోనా వైరస్ రూపాల నుంచి కాపాడగలిగే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందా? అనే విషయం కూడా ఇంకా పూర్తిగా తెలియదన్నారు ఫౌసీ. భారత దేశానికి వ్యాక్సిన్లు అవసరమనే విషయం స్పష్టమవుతోందని చెప్పారు. అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ భారత దేశంలోని ఆరోగ్య వ్యవస్థతో కలిసి పని చేస్తున్నదని ఆయన తెలిపారు.
కాగా, శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 3,46,786 కొత్త కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి దేశంలో కాలుమోపినప్పటి నుంచి ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈరోజే కాదు. గత రెండు మూడు వారాలుగా కొత్త కేసుల విషయంలో ప్రతిరోజూ రికార్డు బద్దలవుతూనే ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..