Covid-19 | కొత్త వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. జేఎన్.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా పలు అధ్యయనాలు గుర్తించారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా అనేక దేశాల్లో కొవిడ్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మీడియా నివేదికల ప్రకారం సింగపూర్లో కరోనా మరోసారి గరిష్ఠ స్థాయికి చేరింది. అమెరికాలోనూ కొవిడ్ నిపుణులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. పలు దేశాల్లోనూ రోజువారీ కొవిడ్ కేసులు గతేడాది రికార్డులను బద్దలుకొడుతున్నాయి.
కరోనా మహమ్మారి డేటాను పరిశీలిస్తే.. డిసెంబర్ 2019లో మొదలైన కరోనా వైరస్ గత నాలుగేళ్లలో 70,11,57,669 మందికి సోకింది. ఇందులో 69,64,862 మంది వైరస్ సోకి మరణించగా.. 67,22,50,203 మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. అయితే, పెరుగుతున్న కొవిడ్ కేసులపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కేసులతో కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో వైరస్ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ తీవ్రమైన సమస్యలకు ఏమీ కారణం కాకపోయే.. వైరస్ వేగంగా విస్తరిస్తుందని పేర్కొంటున్నారు.
భారతదేశంలో కరోనా పరిస్థితి గురించి మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 774 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,187కి పెరిగింది. 24 గంటల్లో రెండు మరణాలు నమోదయ్యాయి. డిసెంబర్ 5 వరకు రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య రెండంకెలకే పరిమితమైంది. చల్లటి వాతావరణ పరిస్థితులు, కొత్త వేరియంట్ జేఎన్.1 కారణంగా రోజువారీ కేసులు పెరిగాయి. కర్నాటక, కేరళలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
సింగపూర్లో కరోనా గరిష్ఠ స్థాయికి చేరుకుందని వైద్యులు పేర్కొంటున్నారు. చాలా ఆసుపత్రులు ఇప్పటికీ సాధారణం కంటే ఎక్కువ మంది రోగులను కలిగి ఉన్నాయి. రాబోయే నెలల్లో పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్తో పోలిస్తే.. దేశంలో కరోనా కేసులు 20 శాతం తగ్గాయని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ.. జనవరి-ఫిబ్రవరిలో కేసులు పెరిగే అవకాశం ఉందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. రాబోయే నెలల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని దేశంలోని ఆసుపత్రులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. రోజుకు సగటున 50 నుంచి 60 మంది రోగులను శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని నివేదిక తెలిపింది. ఇందులో ఎక్కువ కొవిడ్-19 ఇన్ఫ్లుఎంజా కేసులున్నాయి.
సింగపూర్తో పాటు అమెరికాలోనూ కరోనా కొత్త వేరియంట్ కారణంగా.. గత కొన్ని రోజులుగా చాలా ఆసుపత్రుల్లో సోకిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కేసుల దృష్ట్యా.. ఆసుపత్రుల్లో ఫేస్మాస్క్లు ధరించడం తప్పనిసరి చేశారు. కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, మసాచుసెట్స్, వాషింగ్టన్తో సహా అనేక రాష్ట్రాలు కూడా ఇండోర్ మాస్కింగ్ అవసరమని మార్గదర్శకాలను జారీ చేశాయి. పెరుగుతున్న కరోనా ప్రమాదాల దృష్ట్యా, జేఎన్.1 మరో వేవ్కు కారణమయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
దేశంలో కరోనా గణాంకాలను పరిశీలిస్తే.. గత మూడు నాలుగు రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య 700పైగా నమోదవుతున్నది. దేశంలోని దాదాపు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల దృష్ట్యా.. కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు ఆరోగ్య అధికారులను పరీక్షలను వేగవంతం చేయాలని, ఫ్లూలాంటి లక్షణాలు ఉన్న వారందరి నమూనాలను సేకరించాలని ఆదేశించారు. జేఎన్.1 కేసులు పెరిగిన ఇతర రాష్ట్రాల్లో కేరళ, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనే ఉన్నాయి. కరోనా నుంచి ప్రజలందరూ తమను తాము రక్షించుకోవాలని ఆరోగ్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.