హైదరాబాద్ : రాష్ర్టంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్పై ఆ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మున్సిపల్ శాఖలో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ కార్మికులందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నామని, వారందరికీ కరోనా టీకా ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేయడం సంతోషంగా ఉందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ సిబ్బందికి 96.19%, మిగతా 141 మున్సిపాలిటీలలోని సిబ్బందికి 95.55% టీకా పంపిణీ కార్యక్రమం పూర్తయిందన్నారు. మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ విభాగంలో టీకా పంపీణీ ప్రక్రియను వీలైనంత త్వరగా 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.