బీజింగ్, జూలై 11: పురుషునికి రుతుస్రావం అంటే ఓ వింత. చైనాలో అలాంటి వింతే వెలుగు చూసింది. 33 ఏండ్ల ఓ యువకునికి తరచూ కడుపునొప్పి, మూత్రంలో రక్తం వంటి సమస్యలు వేధించేవి. డాక్టర్లు మొదట్లో మూత్రాశయ జబ్బుల వల్ల అలా జరుగుతున్నదని భావించారు. అపెండిసైటిస్ అనుకొని ఆపరేషన్ కూడా చేశారు. సమస్య తగ్గకపోవడంతో ఉదరాన్ని పరీక్షించారు. అతనికి స్త్రీ, పురుష జననావయవాలు రెండూ ఉన్నట్టు తేలింది. పౌరుష గ్రంథితో పాటు గర్భాశయం, అండాశయాలు కనిపించడంతో డాక్టర్లు అవాక్కయ్యారు. అరుదైన ఉభయలింగ వ్యక్తిగా అతడిని గుర్తించారు. మూత్రంలో పడుతున్న రక్తం నిజానికి రుతుస్రావమని తేల్చారు.