బీజింగ్, జనవరి 7: బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో చైనా డ్రైవర్ లెస్ బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. దీని వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఇందులో అథ్లెట్లకు ప్రత్యేక లాకర్లు ఉన్నాయి. 5జీతో అనుసంధానం చేసిన బ్రాడ్క్యాస్ట్ స్టూడియో ఉంది. వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానున్నాయి.