రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరు ప్రపంచం శాంతికి చిచ్చుపెట్టింది. ఇది రష్యా ఆధిపత్య ధోరణికి నిదర్శనమని పాశ్చాత్య దేశాలు వాదిస్తున్నాయి. అయితే ఈ గొడవను ప్రారంభించింది అమెరికానే అని చైనా అంటోంది. రష్యాలో చైనా అంబాసిడర్ ఝాంగ్ హాన్హూయ్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్ సంక్షోభానికి ప్రధాన కారణం అమెరికానే. యుద్ధాన్ని సాగదీసి, ఆంక్షలు విధించడం ద్వారా రష్యాను నాశనం చేయాలనే లక్ష్యంతోనే అమెరికా ఈ ప్లాన్ చేసింది’’ అని ఆరోపించారు. తైవాన్లో అమెరికా స్పీకర్ పెలోసీ పర్యటనను ఉద్దేశిస్తూ.. ‘‘అలాగే ప్రపంచ శాంతికి ప్రధాన నియమం.. ఒక దేశ అంతర్గత విషయాల్లో మరో దేశం వేలు పెట్టకూడదనేది’’ అని ఆయన చెప్పారు.