బీజింగ్, మే 19: భూమిని పోలి, జీవానికి అనుకూలమైన గ్రహాన్ని వెతకడం కోసం చైనా శాస్త్రవేత్తలు కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనికి క్లోజ్బై హ్యాబిటబుల్ ఎక్సోప్లానెట్ సర్వే(చెస్) అని పేరు పెట్టారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా సౌర కుటుంబానికి ఆవల, భూమికి 32 కాంతి సంవత్సరాల దూరంలో భూమిని పోలిన గ్రహం కోసం అన్వేషణ సాగనున్నది. సూర్యుడిలాంటి వందకు పైగా నక్షత్రాలను చెస్ పరిశీలిస్తుంది.