బీజింగ్: చైనాలోని జెంగ్జూలో ఉన్న యాపిల్ ఐఫోన్ ప్లాంట్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. అదికాస్తా ఉద్రిక్తతలకు దారితీయడంతో ప్రభుత్వం జెంగ్జూలో పట్టణంలో లాక్డౌన్ విధించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు తమ ఇండ్లలోనుంచి బయటకు రాకూడదని ఆదేశించారు.
చైనాలోని జెంగ్జూ ప్రాంతంలో యాపిల్ తయారీ కేంద్రం ఫాక్స్కాన్ ప్లాంట్ ఉన్నది. ఇక్కడ ఐఫోన్లను తయారుచేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది ఇంటి ముఖం చూడక చాలా రోజులైందని అక్కడి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించారు.
ఈ ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం తెల్లవారుజామున వందలాది మంది ఒక్కసారిగా విధులు బహిష్కరించి బయటకొచ్చి ఆందోళనకు దిగారు. సరైన వసతులు కల్పించడంలేదని, జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. కొవిడ్తో బాధపడుతున్న చాలా మంది ఉద్యోగులు ఈ యూనిట్లో ఉన్నప్పటికీ.. వారికి వేరే గదులు కేటాయించడం లేదని ఆందోళన చెందుతున్నారు.
Les policiers chinois prennent la fuite ce soir face aux ouvriers de l'usine d'iPhone de Zhengzhou #Chine #China pic.twitter.com/comGMvr36p
— Anonyme Citoyen (@AnonymeCitoyen) November 23, 2022