న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah).. అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటనను చైనా(China) విదేశాంగ శాఖ ఖండించింది. తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఇండియా ఉల్లంఘిస్తున్నట్లు చైనా ఆరోపించింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లో ఉన్న కొన్ని ప్రాంతాలకు చైనా తమ పేర్లను పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా, చైనా మధ్య మళ్లీ బోర్డర్ గొడవ ప్రారంభమైంది. ఇవాళ మీడియాతో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్(Wang Wenbin) ఓ ప్రశ్నకు బదులిస్తూ.. జాంగ్నన్ తమ దేశ భూభాగమని అన్నారు. జాంగ్నన్లో భారతీయ అధికారులు పర్యటించడం తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంగించడం అవుతుందని, సరిహద్దుల్లో శాంతి, సామరస్యతకు విఘాతం ఏర్పడుతుందని ఆయన అన్నారు.