బీజింగ్: చైనాలో మళ్లీ కోవిడ్-19 కేసులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య నగరమైన చాంగ్చున్లో కొత్త ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఇలా ఉన్నాయి. స్థానికులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దు. ఫ్యామిలీ సభ్యుల్లో ఒకరే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలి. అది కూడా రెండు రోజులకు ఒకసారి మాత్రమే. నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మూడు సార్లు కరోనా పరీక్షలను చేయించుకోవాలి. అత్యవసరం కాని సేవల్ని రద్దు చేశారు. ట్రాన్స్పోర్ట్ లింకులను కూడా మూసివేశారు. యుచెంగ్ నగరంలో కూడా ఆంక్షలు అమలులో ఉన్నాయి.