బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ నగరంలో టార్చ్ రిలే జరిగంది. అయితే రెండేళ్ల క్రితం గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ రెజిమెంట్ కమాండర్ టార్చ్ బేయరర్గా రన్లో పాల్గొనేందుకు చైనా అవకాశం ఇచ్చింది. బుధవారం జరిగిన ఒలింపిక్ జ్యోతి ర్యాలీలో సుమారు 1200 మంది టార్చ్బేరర్లు పాల్గొన్నారు. దాంట్లో 2020, జూన్ 15న గాల్వాన్లో జరిగిన ఘర్షణలో గాయపడ్డ రెజిమెంట్ కమాండర్ క్యూ ఫాబావో ఉన్నట్లు ఆ దేశానికి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. గాల్వాన్ దాడిలో ఫాబావో తలకు గాయమైంది. స్కేటింగ్ చాంపియన్ వాంగ్ మెంగ్ నుంచి అతను టార్చ్ను అందుకున్నట్లు తెలిపారు. గాల్వన్ దాడిలో చనిపోయినట్లు నలుగురు సైనికులను గతంలో చైనా సన్మానించిన విషయం తెలిసిందే. ఒంటర్ ఒలింపిక్స్ ఓపెనింగ్ కార్యక్రమంలో అధ్యక్షుడు జీ జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అయిదుగురు సెంట్రల్ ఏషియా అధ్యక్షులు, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పాల్గొననున్నారు.