బీజింగ్, మే 3: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్టుపై వాతావరణ అధ్యయన కేంద్రం నిర్మాణానికి చైనా శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా ఈ సంగతి వెల్లడించింది. టిబెట్, నేపాల్ సరిహద్దుల్లో నిర్మించే ఈ కేంద్రం నుంచి గాలి వేగం, దిశ, తేమ తీరుతెన్నులను అధ్యయనం చేస్తారు.
8,800 మీటర్ల ఎత్తున మౌంట్ కోమోలాంగ్మా (చైనా భాషలో ఎవరెస్టు పేరు)పై క్లిష్ట పరిస్థితుల్లో వాతావరణ కేంద్రం నిర్మాణం సాగుతున్నదని, ఇలాంటివి మొత్తం 8 వరకూ నిర్మిస్తారని ట్విట్టర్లో జిన్హువా పేర్కొన్నది.