బీజింగ్: చైనాలోని (China) గువాంగ్డాంగ్ ప్రావిన్స్లో (Guangdong) దారుణం చోటుచేసుకుంది. లియాన్జియాంగ్ (Linanjiang) కౌంటీలోని కిండర్గార్టెన్లోకి (kindergarten) చొరబడిన ఓ 25 ఏండ్ల వ్యక్తి.. అందులో ఉన్నవారిపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆరుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానితుడిని అరెస్టు చేశారు.
ఆ యువకుడు లియాన్జియాంగ్కు చెందినవాడిగా గుర్తించారు. అతడు ఊ అనే ఇంటి పేరు కలిగి ఉన్నాడని తెలిపారు. అయితే అతడు కిండర్గార్టెన్పై ఎందుకు దాడిచేశాడనే కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ప్రస్తుతం అతడు తమ అదుపులోనే ఉన్నాడని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన చర్చ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వైబోలో (Weibo) టాప్ ట్రెండింగ్లో ఉన్నది. ఇప్పటివరకు 130 మిలియన్ల మంది దీనిని వీక్షించారు.