గ్లాస్గౌ: మాంసాహార ప్రియుల్లో చికెన్ టిక్కా తినని వారుండరు.. తెలియని వారుండరు. ఈ చికెన్ టిక్కా మసాలా ఫార్ములాను కనుగొని ప్రపంచ వ్యాప్తంగా జనం మన్ననలు అందుకొన్న అహ్మద్ అస్లాం అలీ (77) ఇటీవలే మరణించారు.
సోమవారం ఆయన మరణించినట్లు అస్లాం అలీ కుటుంబ సభ్యులు గురువారం ప్రకటించారు. బ్రిటన్లోని షిష్ మహల్ అనే రెస్టారెంట్ అధినేత, చెఫ్ అయిన అస్లాం అలీ.. తన హోటల్లో చికెన్ టిక్కా డ్రైగా ఉందంటూ 1970లో ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో తాను ఈ మసాలాను తయారు చేశానని చెబుతుండేవారు.