ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ అసెంబ్లీలో శనివారం రగడ జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై దాడి చేశారు. లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు పంజాబ్ అసెంబ్లీ శనివారం సమావేశమైంది. ఈ నేపథ్యంలో సభ నిర్వహించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై అక్కడ అధికారంలో ఉన్న పీటీఐ సభ్యులు దాడి చేశారు. ఆయనపైకి కమలం పువ్వులు విసిరారు. అంతేగాక మజారీ జట్టుపట్టుకుని దాడి చేశారు. కొందరు పీటీఐ సభ్యులు ఆయన చెంపపై కొట్టారు. పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా వీరిని నిలువరించలేకపోయారు.
కాగా, ఈ ఘటన నేపథ్యంలో ఆయుధాలు కలిగిన సెక్యూరిటీ గార్డుల రక్షణలో డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీ వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పంజాబ్ అసెంబ్లీ సమావేశం పీటీఐ, పీఎంఎల్క్యూ సభ్యుల తీరు వల్ల ఆలస్యమైంది. మరోవైపు ఇమ్రాన్ఖాన్తోపాటు ఆయన పార్టీ సభ్యుల తీరుపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. హిట్లర్ మాదిరిగా నియంతగా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిని తాము అడ్డుకుంటామని విపక్ష నేతలు పేర్కొన్నారు.
Pti and pmlQ members resorting to violence eventually in Punjab assembly. Assault on Deputy speaker Dost Mazari makes it another sad day for democracy in this country and a blatant violation of LHC order.
God knows what else is left for us to see, disturbing visuals. pic.twitter.com/RkblxWmd4g— Absa Komal (@AbsaKomal) April 16, 2022
Imran Niazi is hell bent to create anarchy at all levels. The display of vandalism, hooliganism & violence in Punjab Assembly by PTI & Q League MPAs to block election of Chief Minister is most condemnable. Imran is proving that he is Hitler’s disciple but will be stopped. pic.twitter.com/tNLKLjOGpa
— Ahsan Iqbal (@betterpakistan) April 16, 2022