Canada | టొరంటో: భారత్ అల్టిమేటం నేపథ్యంలో తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించింది. ఈ నెల 10 లోగా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని ఇటీవల భారత ప్రభుత్వం ఆ దేశానికి హెచ్చరికలు చేసింది.
ఈ నేపథ్యంలో భారత్లోని తమ దౌత్యవేత్తలను సింగపూర్, కౌలాలంపూర్కు కెనడా తరలించినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. అయితే భారత్లోని తమ దౌత్యవేత్తలకు బెదిరింపులు వస్తుండటంతోనే వారిని ఇతర దేశాల్లో సర్దుబాటు చేస్తున్నామని కెనడా ప్రకటించింది.