టొరొంటో: దేశంలోకి విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం విధించాలంటూ వస్తున్న ప్రతిపాదనలపై కెనడా ప్రధాని సానుకూలంగా స్పందించారు. కెనడాలో గత కొంతకాలంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ముఖ్యంగా ఒంటారియో ప్రావిన్స్ను కరోనా థర్డ్ వేవ్ అతలాకుతలం చేస్తున్నది. పలు దేశాల్లో బయటపడ్డ కొవిడ్ వేరియంట్లకు సంబంధించిన కేసులు కూడా ఒంటారియోలో నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఒంటారియో ప్రావిన్స్ ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్ విదేశీ విద్యార్థులపై దేశంలో నిషేధం విధించాలంటూ కెనడా ప్రధానికి కీలక ప్రతిపాదన పంపించారు. డౌగ్ ఫోర్డ్ ప్రతిపాదనపట్ల కెనడా ప్రధాని సానుకూలత వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను గనుక అమలు చేస్తే భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనున్నది. ఇప్పటికే కెనడా ప్రభుత్వం భారత విమానాలపై కూడా 30 రోజులపాటు నిషేధం విధించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రాష్ట్రాలకు 16.37 కోట్ల ఉచిత వ్యాక్సిన్: కేంద్రం
దండం పెడుతా మాస్కులు ధరించండి: ముంబై మేయర్
పోలీస్ అధికారికే రూ.97 వేలు టోకరా.. నైజీరియన్ అరెస్ట్
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
నన్ను భారత్కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!