చికాగో: ఐఫోన్, సోలార్ ప్యానెల్, టీవీ ఇలా ఏ ఎలక్ట్రానిక్ పరికరం తయారీకైనా వాహక పదార్థాలు (కండక్టర్స్) చాలా అవసరం. కొన్నేండ్ల వరకూ వెండి, బంగారం, రాగి, ఇనుము తదితరాలను వాహకాలుగా ఉపయోగించారు. 50 ఏండ్ల కింద డోపింగ్ ప్రక్రియ ద్వారా సెమీ కండక్టర్స్ను తయారుచేశారు. అయితే, తేమకు, అధిక ఉష్ణోగ్రతకు గురైతే ఇవి వాహక తత్వాన్ని కోల్పోతాయి. కాగా, చికాగో పరిశోధకులు ఏ పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండే సరికొత్త విద్యుత్తు వాహక పదార్థాన్ని ఆవిష్కరించారు. నికెల్ అణువులను కార్బన్, సల్ఫర్తో తయారుచేసిన మాలిక్యులర్ పూల స్ట్రింగ్లో అమర్చారు. అది ఆశ్చర్యకరంగా వాహకంలా పనిచేసింది. ఇది పరమాణు నిర్మాణపరంగా ప్లాస్టిక్లాగా ఉన్నా.. విద్యుత్ వాహకంలా పనిచేసింది.