లా పాజ్ : దక్షిణ అమెరికాలోని బొలీవియాలో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రజా రవాణా బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కనే ఉన్న లోయలో 100 మీటర్ల లోతులో పడిపోయినట్లు అదికారులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తమ సహాయక చర్యలను కొనసాగిస్తోంది. మృతదేహాలను వెలికితీస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.