గుజావు: చైనాలో బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆ రైలు డ్రైవర్ మృతిచెందాడు. మరో ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుయాంగ్ నుంచి గువాంగ్జూకు వెళ్తున్న డీ2809 రైలు గుజావు వద్ద పట్టాలు తప్పింది. రైలుకు చెందిన రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. మట్టిచరియలు విరిగిపడడం వల్ల ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. రైలు ఇంజిన్ పట్టాలు తప్పి రాంగ్జియాంగ్ ఫ్లాట్ఫామ్ మీదకు దూసుకువెళ్లింది. ట్రైన్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసమైంది. గజావు గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టాల మీదకు మట్టి, రాళ్లు కొట్టుకువచ్చాయి. అయితే బుల్లెట్ రైలు వెళ్తున్న సమయంలో ఆ మట్టికుప్ప పట్టాలపై పడినట్లు భావిస్తున్నారు.