లండన్: బ్రిటన్కు చెందిన బీటీ గ్రూపు(BT Group) 55 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నది. ఖర్చులు తగ్గించే ఉద్దేశంతో ఆ సంస్థ ఉద్యోగుల్ని తీసివేయనున్నది. 2030 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు చెప్పింది. బ్రిటీష్ టెలికామ్స్ అండ్ టెలివిజన్ గ్రూపు బీటీలో సుమారు 42 శాతం సిబ్బందిని తగ్గించనున్నారు. బ్రిటన్కు చెందిన మరో మొబైల్ కంపెనీ వోడాఫోన్ రెండు రోజుల క్రితం భారీ లే ఆఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న మూడు ఏళ్లలో ఆ కంపెనీ 11వేల ఉద్యోగుల్ని తొలగించనున్నది.
బీటీ సంస్థలో సుమారు లక్షా 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. దీంట్లో కాంట్రాక్టర్లు కూడా ఉంటారు. రానున్న అయిదు నుంచి ఏడు ఏళ్ల సమయంలో.. బీటీ కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను 75 వేల నుంచి 90 వేల వరకు కుదించనున్నది. ప్రపంచవ్యాప్తంగా టెకీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే.
ఫైబర్ బ్రాడ్బ్యాండ్, 5జీ నెట్వర్క్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత.. మెయింటేనెన్స్ కోసం ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేదని బీటీ సంస్థ తెలిపింది. గత వార్షిక సంవత్సరంలో సంస్థ నికర లాభం 50 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.