కాబూల్ : ప్రపంచం భయపడుతున్నట్లుగానే ఆఫ్ఘనిస్తాన్లో అరాచకం (Taliban Brutal face) మొదలైంది. తమకు కాదని అప్పటి ప్రభుత్వానికి, అమెరికా సేనలకు బాసటగా నిలిచిన వారిని తాలిబాన్ టార్గెట్ చేసుకుంటున్నది. ఇప్పటికే పలువురిని గుర్తించినట్లు వార్తలు రాగా.. తాజాగా మాజీ మహిళా పోలీసు అధికారిని దారుణంగా హత్య చేశారు. ఎనిమిది నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను పాశవికంగా చంపడంపై సర్వత్రా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. దాంతో ఘటనను ఖండిస్తున్నట్లు తాలిబాన్ ప్రతినిధి ప్రకటించడమే కాకుండా.. విచారణ జరుపుతామని వెల్లడించారు.
ఘోర్ ప్రావిన్స్లోని ఫిరోజ్కోహ్లో నివాసముందే బాను నిగర్ గతంలో పోలీసు అధికారిగా పనిచేశారు. ఆమె ప్రస్తుతం 8 నెలల గర్భవతి. గతంలో ప్రభుత్వానికి తమపై ఫిర్యాదు చేసేవారన్న కోపంతో ఆమెను తాలిబాన్ మట్టుబెట్టినట్లు బీబీసీ తన కథనంలో పేర్కొన్నది. కుటుంబసభ్యులు చూస్తుండగానే ఆమెను వీధిలోకి లాక్కొచ్చి తుపాకీతో తలపై కాల్చి చంపారని, ఆమెను లాక్కొచ్చిన ముగ్గురు అరబిక్ భాషలో మాట్లాడినట్లు స్థానికులు చెప్పారని బీబీసీ తెలిపింది. ఈ వీడియోను పదేపదే ప్రదర్శిస్తూ తమకు వ్యతిరేకంగా నడుచుకునే వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు. షరియత్ చట్టం ప్రకారమే మహిళలు నడుచుకోవాలని తాలిబాన్ ఆదేశిస్తున్నది. అయితే, ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవడంతో ఖండిస్తున్నట్లు తాలిబాన్ ప్రకటించింది. అలాగే, దీనిపై విచారణ జరుపుతామని కూడా పేర్కొన్నది.
1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘన్ను పాలించిన తాలిబాన్.. మహిళలకు విద్యతో పాటు ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. శనివారం కాబూల్లో వందలాది మంది మహిళలు తాలిబాన్కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.
లాహోర్ను ముట్టడించిన భారత సేనలు
ఈ నెల 15 న పౌరుల తొలి అంతరిక్ష యాత్ర
ఏవీ లేని ఈ కాటేజ్కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..