లండన్ : కోహినూర్ వజ్రం లేకుండానే బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం జరుగుతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కోహినూర్ వజ్రం లేని కిరీటాన్ని ధరించి పట్టాభిషేక కార్యక్రమంలో రాణి కెమిల్లా పాల్గొనబోతున్నారు. మే 6న అట్టహాసంగా జరగనున్న కింగ్ చార్లెస్-3 పట్టాభిషేక కార్యక్రమానికి క్వీన్ మేరీ కిరీటాన్ని రాణి కెమిల్లా ధరించబోతున్నట్టు తెలిసింది.
టవర్ ఆఫ్ లండన్లో ఉన్న క్వీన్ మేరీ కిరీటాన్ని పట్టాభిషేక కార్యక్రమానికి సిద్ధం చేయాలని కెమిల్లా నుంచి ఆదేశాలు వెళ్లాయి. క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ఈ కిరీటాన్ని రాణి కెమిల్లా ధరించబోతున్నట్టు తెలిసింది.