బ్రసిలియా: కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని మరోసారి గడగడ లాడిస్తున్నది. బ్రెజిల్లో కరోనా మృత్యుకేళి చేస్తున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని మహిళలు గర్భందాల్చడాన్ని వాయిదా వేసుకోవాలని అక్కడి ప్రభుత్వం కోరింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాఫెల్ కమారా సీఎన్ఎన్తో మాట్లాడుతూ మహిళలకు ఈ మేరకు పిలుపునిచ్చారు. కరోనా రెండో వేరియంట్ తీవ్రత ద`ష్ట్యా అవసరమైతే గర్భధారణను వాయిదా వేసుకోవాలని కోరారు. 42, 43 ఏండ్ల వయసు మహిళలకు తాను ఈ విషయం సూచించడం లేదని, వయసులో ఉన్నవారు కొంతకాలం వేచి ఉండే అవకాశం ఉన్నవారు దీని గురించి ఆలోచించాలని పేర్కొన్నారు.